Wednesday, May 31, 2017

.భగవద్గీత పద్యాలు

---------- Forwarded message ----------
From: "Telugu Vedika" <teluguvedika.net@gmail.com>
Date: Mar 1, 2017 1:30 PM
Subject: Re: నమస్తే అండీ.భగవద్గీత పద్యాలు పంపుతున్నాను.పరిశీలించగలరు.పత్రికలో ప్రచురిస్తే లింక్ పంపగలరు.ధన్యవాదములండీ.
To: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Cc:


2017-02-07 6:30 GMT+05:30 Uma Devi Balluri <uma.balluri@gmail.com>:
నమస్తే .శుభోదయమండీ.ఇవి ప్రచురించారా.పఅరచురించి యుంటే లింక్ పంపగలరు.

On Dec 20, 2016 1:18 PM, "Uma Devi Balluri" <uma.balluri@gmail.com> wrote:
Thank u sir.

On Dec 20, 2016 12:25 PM, "Telugu Vedika" <teluguvedika.net@gmail.com> wrote:
dhanyosmi madam

2016-12-20 11:59 GMT+05:30 Uma Devi Balluri <uma.balluri@gmail.com>:

నమస్తే అండీ ఈ భగవద్గీతపద్యాలన్నీ నాస్వీయరచనలే.

On Dec 20, 2016 10:40 AM, "Telugu Vedika" <teluguvedika.net@gmail.com> wrote:
నమస్కారం ఉమా దేవి గారు,
ఈ పద్యాలు మీరు స్వంతగా వ్రాసినవా? దయచేసి హామీ పత్రం పంపగలరు మీ ఫోటో తో సహా.
వచ్చే నూతన సంవత్సర సంచికలో ప్రచురించ గలము.


2016-12-16 16:19 GMT+05:30 Uma Devi Balluri <uma.balluri@gmail.com>:

అంశం: భగవద్గీత

ఆ.వె:భారత రణమందు పాండుతనయునకు
       తెలిపె కృష్ణు డచట తెలుసుకొమ్మ
      టంచు పదునెనిమిది యధ్యాయములతోడ
      నున్న గీత  నచట నొప్పు గాను.

ఆ.వె:యుద్ధభూమిలోన యోధు లిద్దరు చేయు
        భాషణమ్మె నదియు భారతాన
        భక్తి గ్రంథ మవగ పఠియింత్రు జనులెల్ల
         ముక్తి మార్గమనుచు ముదము తోడ.

ఆ.వె:కామ రహితమైన కార్యాచరణమున
         మనసు శుద్ధి యౌను మహిని జూడ
        నట్టి మనసె వలయు నాధ్యాత్మితకటంచు
        చక్కగాను గీత జగతి చాటె.

ఆ.వె:భక్తియోగమనగ బ భావశుద్ధియెనంచు
          వ్యక్తి పరము గాక భక్తి పూర్వ
            కముగ తెలియ మనుచు ఘనుడైన యాశౌరి
          చేసె తత్త్వబోధ శీఘ్రము గను.

ఆ.వె:శరణు జొచ్చు వారు సంతాపమందరు
          మూడు గుణములకును మోహితు లవ
         కుండ దాట గలరు కూర్మితోడ భువిని
           యనుచు దెల్పె శౌరి యర్జునునకు.

ఆ.వె:జనన మరణ మాది సంసార సంద్రాన
        నంతు గాన కీదు లాడు చుండి
      మాయ వశము చేత మలమూత్రములతోడ
       నిండినట్టి తనువె నిజమటంచు.

ఆ.వె:ధర్మ క్షేతఅరమిదియె కర్మభూమియు నిదే
        పోరు సలుప లేను పుడమి నిపుడు
        తోడబుట్టువులను దురమందు చంపుట
        పాడియౌనె దెల్పు పరమ పురుష.

ఆ.వె:తనువు నదురు చుండె ధనువు జారుచు నుండె
       రణము చేయ లేను రథము నిలుపు
       మనుచు కోరినట్టి యర్జును తోడను
       వినుమటంచు పలికె వెన్ను డపుడు.

ఆ.వె:చేయు వాడనిలను చేయించు వాడను
          నేనె పార్థ వినుము నీవు కాదు
       పనులు మాత్రమీవు పదిలముగ చేయుము
      ఫలిత మొసగు వాడ పార్థ నేనే.

ఆ.వె:మూఢ తనము నిపుడు ముందుగా వీడుము
        ధైర్య మూను మయ్య ధరణియందు
       జయము నందు వేళ జడుపదేలనీకు
       భారమెల్ల మోపు పార్థ నీవు.

ఆ.వె:నేను నాది యనున దేదియు నిలలేదు
       నాది యనెడి దేది నీది కాదు
       దురభిమానము విడి తొడుగుము కవచమున్
         పోరు సలుప లెమ్ము పుడమియందు.

ఆ.వె:పనులు చేయ వలెను భక్తి పూర్వకముగ
        ఫలిత మునుగురించి వాంఛ వలదు
         ఆత్మకెపుడు నాశ మనునది లేదయ్య
         తనువు స్థిరము కాదు ధరణి యందు.

ఆ.వె:కామ రహితమైన కార్యములను చేయ
   నుద్భవించు జ్ఞాన ముర్వి యందు
     కామ క్రోధములవి కార్చిచ్చు వంటివి
      కాల్చు చుండు నవియు కడకు నిన్ను.

ఆ.వె:ధర్మ మునిటు నిల్ప దలచుచు కృష్ణుడు
        యుగయుగముల యందు యుత్సుకతన
        కుమతులనిల లోన కూల్చి వేయ దలచి
         నవతరించుచుండు ననవరతము.

ఆ.వె:గుణములందు సత్త్వ గుణము శ్రేష్ట
      మటంచు  
 తమము వీడి చూడు ధరణి యందు
     వెలుగు కానవచ్చు వివ్వచ్చుడా యంచు
      శౌరి తెలియచేసె సంతసాన.
     
ఆ.వె:ఆత్మ కాలబోదు అగ్నిలో నెపుడును
         నీరు తడుపలేదు నెపుడు దాని
       వాయువార్పలేదు వసుధలో నాత్మను
       శాశ్వతంబు నదియు జగతి యందు.

ఆ.వె:జయము నపజయమును సమముగా గైకొన్న
    కర్మబంధము విడి ఘనుడ వౌదు
     మోహము విడ నీవు ముక్తుడౌదువటంచు
       నచ్యుతుండు దెలిపె నాదరాన.

ఆ.వె:కుతకమెక్కువైన కోరికల్ కలుగును
         కోర్కె తీరకున్న క్రోధ మొదవు
         క్రోధ మధికమైన కువలయమందున
        పతనమది మొదలగు పార్థ వినుము.

ఆ.వె:పరమ గోప్యమైన భగవంతు నుక్తిని
           నాలకించి పల్కె నర్జునుండు
          మోహమెల్ల తొలగె  మోహనకృష్ణుడా
         నాచరింతు నయ్య నాహవమ్ము.


కం:అష్టమ సుతుడై పుట్టుచు
  శిష్టుల కావంగ బోధ చేసెను గీతన్
   యిష్టముతో విని పార్థుడు
  తుష్టుండై పోరు సల్పె దురమున వడిగాన్.
చిరునామ:
Dr.B.Umadevi
2-106,Nandagokula
KAMAVARAM post
KOWTHALAM Mandalam
AAS College post
PIN:518302,



--
------
... మీ తెలుగువేదిక

ఎడిటర్ గారూ నమస్తే.భగవద్గీతపై నేను రచించిన ఈపద్యములు నాస్వంత రచనములు.ఇవి దేనికీ అనుకరణముకానీ అనుసరణముకాని కావని హామీపత్రమును జతపరచుచున్నాను.





--
------
... మీ తెలుగువేదిక




--
------
... మీ తెలుగువేదిక

Saturday, May 20, 2017

భీమార్జునవిజయము

విరాటపర్వము:;కీీచకవధ:-
  వేదవ్యాసుడు సంస్కృత భాషలో మహాభారతమును వ్రాశాడు .పంచమ వేదమనదగిన ఆ భారతమును కవిత్రయము అను పేరుతో ప్రసిద్ధిగాంచిన నన్నయ,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగుభాషలో అనువదించారు.ఆదికవి నన్నయ ఆది,సభాపర్వాలు పూర్తిగానూ,అరణ్యపర్వంలో సగభాగం వరకు వ్రాశాడు.కవిబ్రహ్మగా బేరుగాంచిన తిక్కన విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలుఅనువదించాడు.ప్రబంధపరమేశ్వరుడైన ఎఱ్ఱన అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు.
     తెలుగువారికి భారతమంటే చాలా ఇష్టం.ఎంత ఇష్టమంటే"వింటే భారతం వినాలి,తింటే గారెలే తినాలి"అనేంత ఇష్టం.
      తిక్కన ప్రారంభించిన విరాటపర్వం హృదయోల్లాసం కల్గించేది.అనేక రసాలతో కూడుకొన్నది.విరాటపర్వ కథకు సంబంధించిన చిత్రపటాలను చూసి నప్పుడు నా మదిలో మెదలిన పద్యములివి.కీచకవధ,ఉత్తర గోగ్రహణ ఘట్టములు కథా వస్తువులైనవి.
పాండవులు కౌరవులతో జూదమాడి ఓటమి పాలౌతారు.పందెపు నియమానుసారము 12సంవత్సరములు అరణ్యవాసము,ఒక ఏడు అఙ్ఞాతవాసము చేయాలి.దానికి బద్ధులై పాండవులు అడవులకు వెళ్ళడంతో " కీచకవధ "కథ ప్రారంభ మౌతుంది.

ఆ.వె:  శ్రీనివాసునకును సిరిదేవికిని మ్రొక్కి
         వాక్కు నొసగు మనుచు వాణిఁవేడి
         ఆది పూజితునకు నంజలి ఘటియించి
          వ్రాయ బూని తేను బ్రాతి తోడ.                                          : 1:

ఆ.వె:కపట జూదమాడి కౌరవేయు లచట
        పాండుసుతుల నెల్ల పరిభవింప
         పంత మాడినటుల  పాండవు లెల్లరు
         బయలుదేరినారు భామ గూడి.                                           : 2 :

ఆ.వె: కృష్ణు దయను పొంది కృష్ణతో బాటుగా
        పాండు తనయులెల్ల పదియు రెండు
        వత్స రంబులడవి వాసము జేయుచు
        పూర్తి జేసినారు ముదము తోడ.                                               : 3 :

తే.గీ: వేషములు మార్చుకొని పాండవేయు లెల్ల
       చేయ నఙ్ఞాత వాసము చింత లేక
       మత్స్య దేశంబునకు నేగ మదిని దలచి
       భామ తోడను సాగిరి వడిగ వారు.                                         : 4  :

ఆ.వె: వీరులవలె నున్న వీరలగని రాజు
         యాశ్రయంబు నొసగి యాదరించె
          కంకుభట్టు యయ్యె కౌంతేయు డప్పుడు
          నరుడు నేర్పుచుండె నాట్యములను                                       : 5 :
ఆ.వె: వంటవాడిగానె భాసించె భీముడు
        కవలలిద్దరు పశు కాప రులుగ
        మానిననెడి పేర మగువ ద్రౌపదియేగ
        చేరి రెల్లరచట సేమముగను .                                                   : 6 :

ఆ.వె: కర్మ కాలినపుడు కాలమే శత్రువౌ
        నన్న తీరు గానె నాపదొడమె
        రాజు బావమరిది రమణి ద్రౌపదిఁగని
       మరులు గొనియె తాను మదము తోడ.                                         : 7 :

ఆ.వె: మగువ జూచి తాను మత్తులోబడి, యక్క
        చెంత కేగి వేడె చింత దీర్చు
       మనుచు మనసు లోని మాట తెలియ చేయ
       ముప్పు వచ్చె నంచు ముదిత దలచె.                                              : 8 :
ఆ.వె: హితము బల్క నక్క హీనముగా జూచి
        పొందు కూర్ప కున్న పోవ ననగ
        వలదు వలదు మాట బాగుగా వినవయ్య
        పడతి కైదు మంది పతులు గలరు.                                                   : 9 :

ఆ.వె: సూక్తమైన మాట సోదరి చెప్పంగ
          వినక మూర్ఖు డగుచు విసురుగాను                                               
          తరుణి నంప కున్న తగవె మిగులు నింక
          కీడు తప్ప దనియె కీచకుండు.                                                   : 10 :

ఆ.వె: పతులు ఐదు మంది పడతికి గలరట
        వదలబోరు రాజు బావమరిది
      వనుచు మోహ మింక వలదయ్య వినుమాట
      యనుచు ననునయించి యతివ పలికె.                                             : 11 :

ఆ.వె: కామ పీడితుండు కన్నుమిన్నరయక
        'వేగ పంప కున్న వేటు దప్ప'
        దనగ భీతి నొంది కినుక బాప సుధేష్ణ
       రమ్మని పిలిపించె రమణి నపుడు.                                                   :12 :

ఆ.వె : మధువు వలయు నాకు మగువ నీవిప్పుడే
        తమ్ము నింటి కెళ్ళి త్వరగ తెమ్ము
        ననుచు పలికె తాను నయముగా కృష్ణతో
        కాదు కూడదనక కదలు మనగ                                                        : 13 :

ఆ.వె :మదిని బెంగ పడుచు మారాడగా లేక
        బెదరుచు తనుమధ్య భీతి తోడ
        జరుగ బోవునదియు జరిగ తీరు ననుచు
        కలశ పాత్ర బట్టి  కలికి /కాంత వచ్చె.                                                 : 14 :
ఆ.వె: చిగురుబోడిని గని సింహబలుడు తాను
          చేయి బట్ట బోగ చెలియ పలికె
         వదల వోయి కరము పతులేవురు గలరు
         నిన్ను వీడ రిపుడు నిజము నిజము.                                              : 15 :

ఆ.వె :తులువ తనము తోడ తోయలిన్ వేధింప
        నిండు కొలువు చేరె నీరజాక్షి
        న్యాయ మడుగ బోగ నయముగా కంకుడు
       నడ్డు తగిలి పంపె నతివ నపుడె.                                                    : 16 :

ఆ.వె :బుసలు గొట్టు చున్న  భుజగము వోలెతా
         వేగ నడచె నీలవేణి యపుడె
       యర్జునుని గనుగొని యాగ్రహావేశాన
        బాధ వెళ్ళ గక్కు పడతి జూచి.                                                     : 17 :

ఆ.వె :పవనసుతుడు గలడు బాపునీ యాపద
       వలదు బెంగ యనుచు పార్థు డనగ
      మందయాన సాగె మధ్యము చెంతకు
      ననునయించి పలికె ననిల సుతుడు .                                                :18 :

ఆ.వె: అంత వంత యేల నతివరో భయమేల
        చూచు చుండు మిటులె శుభము గూర్తు
         నాట్య శాల యందు నాతి రూపము దాల్చి
        మట్టు బెడుదు ననియె మరుత సుతుడు.                                           :19 :

                                       

.వె : మాయ మాట లాడి మానిని కీచకున్

          నర్తనంబు సేయు నగరు కడకు

         రమ్ము యనుచు బిలువ రాచఠీవిని బూని

        సింహబలుడు తాను చేర వచ్చె.                                                      : 20 :


ఆ.వె: పడతి వోలె నున్న పవన సుతుని జూచి

        తాను వలచి నట్టి తరుణి యనుచు

       మురిసి దరికి చేర ముష్టిఘాతము తోడ

       గాయ పరచి గూల్చె గాలి సుతుడు.                 21                                  


ఆ.వె : సింహబలుని భీమసేనుండు యెదిరించి

           చీల్చి జంపె తాను చీకటింట

           ముద్ద జేసి వాని మూలకు పడదోసి

           యతివ కోర్కె దీర్చె ననిల సుతుడు.             22                            


ఆ.వె : పాండు సుతుల నరయ పన్నికతో మల్ల

         యోధునంపె నాసుయోధనుండు

         యన్న సైగ తోనె నంత మొందించెను

         వలలుడనగ నున్న వాయు సుతుడు.          : 23 :


ఆ.వె :కీలక మయినట్టి  కీచకు మరణంబె

        పాండు రాజ సుతుల బయలు పరుప

        కౌరవాధి పతియు కలిసి సుశర్మను

       దండయాత్ర కంపె దక్షిణాన                        : 24 :


ఆ.వె :విరటరాజు సాగె వీర సైనికులతో

        దక్షిణంబు వైపు త్వరిత గతిని

         యదును జూచి వచ్చె నాకౌరవేంద్రుడు

        ఉత్సుకతన తాను నుత్తరాన                         :25 :

 ఆ.వె:అయ్య గావు మంచు నాత్రంబు తోరాగ

    కొలువు నందు విరటు కొమరు డడిగె

   భీతి చెంద నేల వేగమె నుడువుడు

  చెంత నుండ నేను చింత యేల.                           26


ఆ.వె:గోవు లపహరించి కురుపతి యచ్చోట

         నురుకు చుండె తాను నుత్తరాన

       విరట రాజు యపుడు వేలసైన్యంబుతో

       వెడలె తాసుశర్మ పీచ మణచ.                         27


  

ఆ.వె:అయ్య గావు మంచు నాత్రంబు తోరాగ

    కొలువు నందు విరటు కొమరు డడిగె

   భీతి చెంద నేల వేగమె నుడువుడు

  చెంత నుండ నేను చింత యేల.       28


ఆ.వె:గోవు లపహరించి కురుపతి యచ్చోట

         నురుకు చుండె తాను నుత్తరాన

       విరట రాజు యపుడు వేలసైన్యంబుతో

       వెడలె తాసుశర్మ పీచ మణచ.       29


ఆ.వె:నేను యిచట నుండ నేటికింక భయము

         జంకు వలదు మీకు జయము మనదె

      తెగువ జూపి మీరు తెండిటు సారథిన్

     యనుచు పలికె తాను నార్తి తోడ                    30


.ఆ.వె:చాటు నుండి విన్న చాన సైరంధ్రి తా

        రాకుమారి చెంత రవము తోడ

     నాట్య గురువు తానె నడుపు రథమునంచు

    పలుక సంతసాన పట్టు బట్టె                           31


.ఆ.వె:అన్న యొప్పె;పిదప నాచార్యు నొప్పింప

            రథము నడుప నతడు రహిని జూపె

             రాకుమారుడపుడు రణము చేయగ నెంచ

            సాగు చుండె క్రీడి జవము తోడ.                   32


.తే.గీ:కౌరవుల సేనగని గుండె గుభిలు మనగ

      భయము తోడ నుత్తరుడటు బరుగు దీయ

      జమ్మి వృక్షము పైనున్న శరము లెల్ల

       జూపి యర్జునుం డాతని శోక ముడిపె.             33


కం: చక్కని సారథి దొరకిన

     గ్రక్కున నేగుచు దునిమెద కౌరవ సేనన్

     యుక్కడగించెద నని తా

     నెక్కుడు సైన్యము గనగనె నిలపై జారెన్.             34


ఆ.వె:గడువు ముగియు చుండ గన్పించె పార్థుడై

         శరము లన్ని యచట జాలు వార

          యుద్ధరంగమందు యోధుడై పోరాడి

             విజయ మంద జేసె విరటు సుతుకు.          35


ఆ.వె:విజయ మందినట్టు విజయుడు దెల్పగ

          పట్టు కుచ్చు లెల్ల పట్టి తేగ

        చెల్లి కోర్కె దీర్చె సెహబాస నగ ప్రజ

       తండ్రి మెచ్చు కొనియె తనయు నపుడు.           36


ఆ.వె: పాండుతనయు లెల్ల పరమ హర్షంబుతో

          నసలు రూపు తోడ నగపడంగ

             సంతసించితాను సతి కోర్కెపై పృథ్వి

               పతి  సుతనుయొసగె పార్థు సుతుకు .       37


.ఆ.వె: అర్జును సుతునకును నతివ యుత్తరకును

        శుభ వివాహ మవగ 'సుఖము గనుడు'

       యనుచు పెద్ద లెల్ల యాశీర్వదింపంగ

       పెండ్లి తంతు ముగిసె వేడ్క తోడ.                  38


                         ********          

    





         



         

.

    





         



          

Wednesday, May 17, 2017

న్యస్తాక్షరి - ప్ర భా త ము.


న్యస్తాక్షరి.ప్ర  భా త ము.

తే.గీ:ప్రకృతి కాంతయు మరియుచు పరవశింప
     భానుడుదయవేళలందు ప్రభలు చూప
      తమ్మిపూవులు కొలనులో దరహసింప
    ముచ్చటగ గాంచిరా సౌరు ముదితలెల్ల.

2.తే.గీ:ప్రథమ పూజలిడ దలచి ప్రణతు లిడుచు
          భాస్కరుని చెంత విప్రులు భాసురముగ
         తడయక ర్ఘ్యము లనిడగ తమిని జూప
      ముదితలు సహకరింపగ మురిసిరెల్ల.

3..తే.గీ: ప్రకటితమవగ నరుణుడు ప్రభలు చూపి
          భాను డేతెంచె గగనాన ప్రాచి దిశను
            తమమ తొలగించిముదమిడ ధరణికాంత
           మురిసి స్వాగతము పలికె మోహనముగ.

4.తే.గీ:ప్రణతు లిడగ వేచిరచట బ్రహ్మవిదులు
        భానుకేసరు రాకకై వార్ధి చెంత
         తరుణమరసి యంబరమున తరణి రాగ
          ముకుళితకరకమలముల మ్రొక్కి రచట.

5.తే.గీ :ప్రకృతి కాంత ప్రాచీ దిశన్ వలపుతోడ
        భానుమంతుని చూచుచు పలవరించి
        తమకమునుచూపుచు నచట త్వరితగతిని
       ముగ్ధవోలె తానరుదెంచ మురిసె రవియు.

6.తే.గీ:ప్రభలు చిలుకుచు గగనాన భాసురముగ
          భానుడేతెంచె గనుడట ప్రజలార
          తమము తొలగ వెలుతురులో ధైర్యమూని
           మురిసి తామరలు విరిసె ముదము తోడ

7.తే.గీ:ప్రగతి పథమున సాగంగ ప్రతిదినమ్ము
          భాసురముగ నిను గొలువ ప్రజలు నెల్ల
          తహతహను బూని వత్తురు ధరణియందు
           ముజ్జగములకు వెలుగిడ ముందు రార.








Monday, May 15, 2017

పరనింద


అంశము:పరనింద

ఆ.వె:పరుల నింద చేయ పాపములంటును
      పరులు నిన్ను దిట్ట పాపమణగు
      పరుల నింద చేసి పాపమార్జించుట
      కన్న నింద చేయకున్న మేలు.

ఆ.వె:నింద చేయ బోకు నీతోటి వారిని
       పాఫ ఫలము నంద వలసి యుండు
    నఘము కలుగు పనుల నాచరింపక యున్న
     జగతి యందు నీకు శాంతి కలుగు.

ఆ.వె:సతము పరుల నింద సలుప నంటు నఘము
      నింద లొంద తొలగు నిజమటండ్రు
      పరుల నింద విడువ బ్రతుకు ధన్యంబౌన
      టంచు నరయు మయ్య నవని యందు.

కం:పరనిందచేయ పాపము
   ధరలో వెంటనె జనులకు తగులును కనుకన్
     పరులచె నిందింప బడక
    పరులను నిందింప కున్న పాపము లణగున్.

కం:పరుల నెపుడు నిందించకు
    యొరుల దురితములు నంటును నుర్విలొ నీకున్
      పరనింద చేసి యఘముల
  మరిపొందక యున్న శాంతి మనసుకు కలుగున్

నల్లధనము


అంశం:  నల్లధనము
                                          డా.బల్లూరి ఉమాదేవి
                                             కామవరం,ఆదోని.

1.ఆ.వె:స్వార్జితంబు నైన సంపద సుఖమిచ్చు
     తనది కాని దేది తరము కాదు
     పైన నొకడు చూచు భగవంతు డుండును
      నల్లధనము నమ్మి నష్టపోకు.

2ఆ.వె:వేతనమునకింత విలువకట్టిన పన్ను
         కట్టవలెను జనులు క్రమముగాను
          కాసుకాశ పడిన కష్టముల్ దప్పవు
         పట్టుబడిన తాను బంది యగును.

3.ఆ.వె:న్యాయరీతి లోన నార్జించిన ధనము
         తృప్తి నొసగుచుండు సృష్టి యందు
         కాదు కూడదనుచు కాపాడ జూచిన
        నల్లధనమె బ్రతుకు నల్ల బరచు

4.ఆ.వె:అక్రమమ్ము గాను నార్జించు ధనమును
        నల్లధనమటంచు నందు రిలను
         దొరకనంత వరకు దొరలు తామౌదురు
         దొరక గానె వారి పరువు పోవు.

5.ఆ.వె:నల్లధనమువెలికి నయముగా రప్పింప
           యుక్తిపన్నెగాదెయుర్వి లోన
           ముఖ్యసచివు డొకడు మొదట కష్టమె యైన
            పిదప మేలు కలుగుభీతి వలదు.
          
6.ఆ.వె:నీతితోడనున్న నెమ్మదిచెడబోదు
          పన్ను కట్టకున్నబాధ పెరుగు
         అట్టి వారి కిలను నగచాట్లు హెచ్చౌను
       తెలుసుకొనుముబిడ్డతెలివికలిగి

7.ఆ.వె:ఒక్కనోటుమార్చ నుర్విమారగ బోదు
            దొంగ నోట్లుదాచు దొరల కిపుడు
         నుయ్యి ముందు వెనకగొయ్యి చందంబ య్యె
        అడుసుతొక్కనేల యడలనేల.

8.ఆ.వె:ఉగ్ర వాదమణచనుర్విలో యత్నించి
           ధనమె మూలమంచు దారి తప్పు
           ధనము నిటుల మంచి దారినిడగ నెంచి
           పెద్ద నోట్లు'మోడి'రద్దుచేసె.

9.ఆ.వె:ఆది లోనకలుగు నన్నియాటంకముల్
           సర్దు కొనును వేగ జగతి యందు
      యో( ఓ)రి మున్న చాలు  నొనగూరు సుఖమలు
         ననెడు మాట లెపుడునమ్మవయ్య.

10.ఆ.వె:నల్ల ధనమటన్న నల్లని పామేను
            కాటు వేయు నదియుకడకు నిన్ను
             పన్ను కట్ట నీకు పైకంబు మిగులును
              దాచు కొన్నదెల్ల దోచ బడును.

11.ఆ.వె:లంచములను మ్రింగి లక్ష్మిపుత్రుడ నంచు
             చెప్పుకోకు మయ్య చేటు కలుగు
                 యిచ్చుట యును మరియు పుచ్చుకొనుటకూడ
                    నేరమనెడి మాట నెరుగవయ్య.

12.ఆ.వె:అక్రమముగ ధనము నవనిలో నార్జించి
              దాచి యుంచ నదియు తప్పె యగును
                పరుల కొంప కూల్చి పైకంబు దాచంగ
                చివర చేతి కెపుడు చిప్ప మిగులు.

13.ఆ.వె:సక్రమముగ ధనము సంపాదించితి వేని
                తరతరములవరకు ధరను మిగులు
                అక్రమముగ వచ్చు నార్జనమ్మంతయు
                   పట్టు బడగ బోవు వసుధ యందు.

14.ఆ.వె:ధనమె మూలమంచు దయమాలి కొందరు
               లంచములను కోరి కొంచమైన
               జాలి లేక జనుల జగతిలో పీడింప
               నదియె  గనుమునిలనునల్ల ధనము.

15.ఆ.వె:గొప్ప నిర్ణయమ్ము ఘనముగా చేపట్టి
            మార్గదర్శకుడయ్యె మహిని మోడి
             కొత్తనోట్లు తెచ్చి చిత్తు చేసెను గదా
             నీతిలేనివారి నిలను తాను.

16.ఆ.వె:దిగులు పడగ వలదు జగతిలో జనులార
              సగటు జీవులకును సంతసమ్ము
               కలుగువార్త నిదియుకలవరము వలదు
                 నల్లధనమనునదితెల్లనగును.

17.ఆ.వె:నల్లధనమ దెెపుడు నాణ్యమైనది కాదు
              న్యాయము విడనాడి  యార్జనమ్ము
               చేయ తొలగు సుఖము చిత్త మశాంతమై
                మిగులు సతము నీకు దిగులు గనుము.

18.ఆ.వె:కట్టె పెట్టె లందు గుట్టుగా దాచిన
               పైకమెల్ల నేడు పనికి రాక
               తికమకపడుచుండి తిట్టుచు నేతలన్
                ఖర్చు చేయ లేక కస్తి పడిరి.

19.ఆ.వె:పెట్టె లందు యున్న పెద్దనోట్లన్నియు
              పెద్ద పాములల్లె భీతి గొలుప
               గుట్టు రట్టు కాగ గుండెగుభిలనంగ
                నేమి చేయ వలెనొ నెరుగ రైరి.

20.ఆ.వె:బీరువాలయందు పెద్ద పెట్టెల యందు
              వంట యింటిలోన వాసిగాను
              మంచమరల యందు మంచిగా దాచిన
              సొమ్ము వ్యర్థమనగ సోలిరెల్ల.

21.ఆ.వె:పెద్ద నోట్లనెల్ల పెట్టెలలో దాచి
             భరత జాతి యొక్క పరువు తీసి
              పరుల పేరు లందు పైకమ్ము దాచిన
               మోసగాళ్ళకిపుడు మూర్ఛ వచ్చె.

22.ఆ.వె:పేద ప్రజల దోచి పెట్టెలు నింపుచూ
               ముందు జాగ్రతనుచు మోహ మంద
               కలము పోటు తోడ కంగారు పెట్టుచు
                 ఘనుడు నయ్యె మోడి కనగ రండు.

23.ఆ.వె:దార్శనికత తోడ ధరణిలో యీనేత
               నల్లధనము నెల్ల తెల్ల చేయ
               నోట్లు రద్దు చేసి గుట్టురట్టునుచేసె
                 నూత మొసగ రండు నుత్సుకతన.

24.ఆ.వె:స్వచ్ఛభారతమ్ముసాధింప                          సమకట్టిగొప్పనిర్ణయమ్మ   కువలయాన
                తీసుకొనియె నితడుదేశమ్ము నికపైన
                బలముపుంజు కొనుచుబాగు పడును.



                
                  

Sunday, May 14, 2017

అమ్మ.

మాతృ మూర్తులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

అంశం:అమ్మ.
          
అమ్మ.

1.ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ

     తరమె యేరి కైన దలచి చూడ

      ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి

        భాగ్యశాలి నంచు పరవశించు..

2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా

          కడుపు చూసి నింపు కరుణ తోడ

          సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను

         అమ్మ ప్రేమ కిలను నంత మేది.

3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు

            సాటిలేని యట్టి మేటి మమత

              నంద చేయు శక్తి యమ్మదే మహిలోన

            తల్లికన్న నెవరు దైవ మిలను.

4.ఆ.వె:విశ్వమందు తాను వేదనను భరియించి

            జన్మ మొసగు నట్టి జనని యెపుడు

             దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా

            దైవతములకెల్ల దైవమామె.

5.కం:అమ్మను మించిన దైవము

         నిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే

          కమ్మగ బిడ్డలు తల్లిని

         నమ్మా యని పిలువగనట హాయిని బొందున్

6.ఆ.వె:ఆస్తులెన్ని యున్న నభిమానమే లేక

        అమ్మ ప్రేమ మరువ నధముడగును

       అట్టి వానిపైన నాదరణను జూపు

        నమ్మకన్న దైవ మవనినెవరు.

7.ఆ.వె:కన్నతల్లి యెపుడు కడుపు జూచుచు నుండు

       కంట నీరు జూడ కలత పడును

       అమ్మ మనసె పెద్దయంబుధి ధరలోన

       మరువ బోకు నీవు మాతృ ప్రేమ.

       తల్లికన్న నెవరు దైవ మిలను.

8ఆ.వె:కాళ్ళు బార జాపి కన్నొత్తి చెక్కొత్తి

          లాల పోసి తుడిచి లాలి పాడి

         నిదుర బుచ్చి నుదుట నిలువు బొట్టునుపెట్జి

       కనుచు మురిసి పోవు కన్న తల్లి.

9.ఆ.వె:తాను తినక సతము తనయులకని దాచు

      నమ్మ ప్రేమ కెపుడు నంతు లేదు

      మమత తోడ పంచు మాధుర్యమును బొంది

     మరువ పాడి గాదు మహిని నిజము.

10.ఆ.వె:అమ్మవంటి దైవ మవనిలో కనరాదు

            తండ్రి కోప గించ తాను కాచు

             అడ్డదారి చనిన బిడ్డను గాపాడ

            మ్రొక్కు లిడుచు తాను ముడుపు గట్టు.

11.ఆ.వె:అమ్మ మాట విన్న నన్నిభాగ్యములబ్బు

          అమ్మ దీవె నున్న నన్ని దొరకు

           అమ్మనవ్వు లోన నమృతమ్ము చిందురా

          అమ్మప్రేమ తోడ నాడు కోకు.

12.ఆ.వె:అమ్మ యలుక బూన నాదిశక్తియె యౌను

         ఆకలన్నవారి కన్న పూర్ణ

      తాటియాకు మంట తల్లి కోపమ్మురా

          అంతలోనె నదియు నారి పోవు.

13.ఆ.వె:చదువు లెల్ల నేర్చి సంస్కారయుతుడైన

       మురిసిపోవు గాదె ముసలి తల్లి

       కొడుకు ప్రేమ ముందు కోటిరూప్యములైన

          సమము కానె కావు జగతి యందు.     

14.ఆ.వె:అడక కుండ దీర్చు నవసరమ్ములు నన్ని

          ఆకలెరిగి తాను నన్నమిడును

   విసుగు యన్న మాట యిసుమంతయును లేక

 యంత్రమల్లె చేయు నన్ని పనులు .

15.ఆ.వె:తనయులున్నతిగని ధన్యత నొందితి

      నంచు మురియు నమ్మ యవని యందు

     ముప్పు నందు గనుము ముదముతో తల్లిని

      యేమి కోర బోదు  యిలను తాను.