ప్రజపద్యం వారి
కార్మికసంక్షేమము.1.కొరకు వ్రాసిన పద్యములు.
ఆ.వె:పొట్ట కూటి కొరకు పుడమిలో కార్మికుల్
పగలు రేయి యనక పనులు చేయ
కడుపు నిండలేక కష్టాలు మెండయ్యె
బ్రతుకు నందుమిగిలె బాధ లెల్ల.
ఆ.వె:కార్మికులిల కడుపు బట్టుకొనుచు
నెంత శ్రమ పడినను నింత సుఖము
గానకడలు చుండ్రి కష్టముల్ కడతేరు
మార్గ మెపుడు వచ్చు మహిని దేవ.
ఆ.వె:శ్రమకు తగిన ఫలము జగతిన కనరాక
కుమిలె కార్మికుండు కువలయాన
నాలు బిడ్డలకిట నాహార మిడలేని
దుస్థితిని తలంచి దుఃఖపడును.
ఆ.వె:పగలు రేయి యనక పట్టు చీరలు నేసి
యమ్మకాని కిడగ నసలు గిట్టు
బాటు ధరయు రాక బాధతో విలపించు
కార్మికులను గాంచ కలుగు వెతయు.
ఉ:కట్టుచు మేడలన్ భువిని కార్మిక సోదరు లెల్లరున్నిటన్
పొట్టకు నిండుగా తినగ పూజ్యము నయ్యెను ధారుణిన్ గనన్
చెట్టుకు పుట్టకున్ చనిరి చింతలు మెండుగ నయ్యె నో ప్రభూ
గుట్టుగ మానమున్ నిలిపి కూరిమి తోడను నన్నుకావుమా!