Saturday, January 28, 2017

సమస్యా పూరణం -1

శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యాలు.1
కం:ఇలలో నాకవి తిక్కన
కలలో కన్పించినట్టి కరుణామూర్తీ
కొలిచెద ననవరతము నిను
నలసింపక కావుమయ్య హరిహరనాథా.
2కం:గరళము మింగిన భవుడవు
శిరమున కేకీకదాల్చు శ్రీహరి వీవం
చెరుగక భ్రాంతిన్ బడుదురు
అరయగ నిరువురునొక్కరె హరిహరనాథా.
3.ఆ.వె:శిరముపైన గంగ శివశంకరునకు
శిరమున నెమలీక శ్రీహరికిని
ద్వందరూపు తోడ దరిసెన మొసగి మా
చింత దీర్పుమయ్య చిద్విలాస.

కృష్ణశతకం. నరసింహకవి.
23.కం:పదియాఱువేల నూర్వురు
సుదతులు యెనమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా! 
భావము : శ్రీహరీ! కృష్ణావతారములో పదహారువేల నూర్గురు గోపికలనూ, అష్టభార్యలనూ సుఖించి తృప్తిపరచిన నీ మహిమ అత్యంత అద్భుతము కదా!

శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
తే.గీ:వ్యాస వాల్మీకులెల్లరు వాసిగాను
ముందుగా గ్రంథముల్ వ్రాసి ముక్తి నంది
నట్టి వ్యాసపీఠమునకు నతులొనర్చి
భక్తి తోమొక్కెద కవితా భాగ్య మొసగు.

కృష్ణశతకం. నరసింహకవి.
క. అంసాలంబిత కుండల
కంసాంతక నీవు ద్వారకా పురిలోనన్
సంసారి రీతినుండి ప్ర
శంసార్హు(డ వైతి వహహ జగతిని కృష్ణా. 22
తా. కృష్ణా ! భుజములను తాకు కుండలములు కలవాడా ! కంసాది దుష్టులను వధించి కారణజన్ముడవయి కూడా ద్వారకానగరిలో మామూలు సంసారివై యుండుట చాలా ఆశ్చర్యము కదా.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య:
*పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్*
.కం: ధరణీపతి యవనాశ్వుడు
పొరపాటున త్రావె మంత్ర పూతజలంబున్
వరమొసగ శచీపతి యా
పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్
మిత్రులందరికీ శుభోదయం.
కృష్ణశతకం. నరసింహకవి.
21 కం: అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా! 
భావము: గరుత్మంతుడు వాహనముగా గల ఓ కృష్ణా! బ్రహ్మాండలోకములను బంతులవలె ఆడే నీవు మందర, గోవర్ధన గిరులను ఎత్తావు అనటం విడ్డూరమా!అంటే కాదుకదా!
కృష్ణశతకం. నరసింహకవి.
20. కం:దేవేంద్రుఁడలుకతోడను
వావిరిగా ఱాళ్ళవాన పడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా! 
భావము: ఓ కృష్ణా! దేవేంద్రుడు చాలా కోపించి, గోపాలురపై అతి తీవ్రమైన భయంకర రాళ్ళ వర్షమును కురిపించగా, ఆ గోవులను, గోపాలురను కాపాడుటకై చిటికెన వేలితో గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన నీ సామర్ధ్యము నేనేమని ప్రశంసించగలను.

శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన ఈక్రింది చిత్రానికి వ్రాసిన పద్యం.
ఆ.వె:సకల మృగము లణచి సాహసోపేతుడై
బలము జూపినట్టి బాలుడితడు
సకల మునులు మెచ్చి సర్వదమనుడనన్
వాసికెక్కె నితడు వసుధ యందు.
(
ఈ బాలుడే శకుంతలా దుష్యంతుల పుత్రుడైన భరతుడు)
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య:
*జ్వర పీడితు డొకడు గోడ జయ్యన దూకెన్*
కం:అరనిమిషంబైన చెలిని
మరువక వెంబడి దిరుగుచు మదిలో వెతతో
తరుణిని గనలేక మదన
జ్వర పీడితు డొకడు గోడ జయ్యన దూకెన్
.
కం:సరియైన చికిత్స యులే
కర కొరవైద్యంబు తోడ కస్తిం బడుచున్
పరిపరి విధముల తిరుగుచు
జ్వర పీడితు డొకడు గోడ జయ్యన దూకెన్
కం:కరుణను జూపక ప్రేయసి
తిరిగైననుచూ డకున్న తిప్పలు బడుచున్
గిరగిర దిరుగుచు కామ
జ్వర పీడితుడొకడు గోడ జయ్యన దూకెన్.

శుభోదయం.మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
"ము"ఖ పరిచయం లేకపోయిన ము
"
ఖ"పుస్తక మిత్రులతో చెలిమిని చేస్తూ వారి
"
పు"రోగతి నాకాంక్షిస్తూ .. వేకువజాము నుండి మ
"
స్త"కాలకు పని పెడుతూ,చేతి వేళ్ళనే
"
క"లములుగా చేసుకొని వానికి పనికల్పించి
"
మి"హిరుడు రాకముందే మేల్కొని మి
"
త్రు"లకు శుభోదయం పల్కుతూ శ్రీ
"
ల"క్ష్మీ పతి అనుగ్రహం కోరుతూ ఒకే
"
కు"టుంబంలా కలసి మెలసి వున్న
"
స్నే"హితులకు
"
హి"తులకూ
"
తు"ష్టిని పుష్టిని యొసగుమని
"
ల"క్ష్మీకాంతుని ప్రార్థిస్తూ ఈ సత్స్నేహం
"
దినదిన ప్రవర్దమానంకావాలనీ మ
"
నో"ల్లాసం అందరికి కలగాలని నిత్యో
"
త్స"వం కావాలని సతతము సకల
"
శు"భఫలాలు పొందాలని ఎల్లప్పుడూ
"
భా"షామతల్లిని కొలుస్తూ వుండాలని
"
కాం"క్షిస్తూ ఆహరహం క్షరంకాని అ
"
క్ష"రాలతో మన స్నేహ పరీమళా
"
లు"దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.
(మొదటి అక్షరాలను గమనించండి.)
కృష్ణశతకం. నరసింహకవి.
17.కం:మడుగుకు జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా!
భావము: ఓ కృష్ణా! అచ్యుతా! కేశవా! కాళీయుని గర్వము అణచుటకు ఆ భయంకర కాళీయుని సర్పముపైననే సరస్సునందు నాట్యమాడి, ప్రకాశించిన ఆ పాదపద్మములను నా మదిలో సదా స్మరింతును తండ్రీ!
కృష్ణశతకం. నరసింహకవి.
16.కం:పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగ పింఛం
బాణీముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా!
భావము:ఓ కృష్ణా! సమస్తలోకాధిపతివై ఉన్నా, నీవు చిన్నపిల్లవానివలే చేతిలో వెన్నముద్దతోనూ, తలపై నెమలిపింఛముతోనూ, ముక్కున నవమౌక్తికముతోనూ అలరారుతున్నావు!
శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన సమస్య:
* సతి చావుకు కారకుండు శంకరుడు గదా!*
.కం:పితృ నింట జరుగు క్రతువున
సతి,పతి యనుమతి గొనకయె చనియట యవమా
నితయై యఙ్ఞంబున పడె
సతి చావుకు కారకుండు శంకరుడు గదా!

ఆ.వె:భరత జాతి కనుల పంటయ్యె పరికింప 
మానవాళి కెల్ల మార్గ దర్శి
మతము కన్న గొప్ప మానవీయత యని
మహిని జాటినట్టి మాన్యుడితడు.
2
ఆ.వె: పేదరికము కాదు విద్యార్జనకు యడ్డు
అనెడి సూక్తి కితడె అసలు ఋజువు
అంచెలంచె లెదిగి అధ్యక్షు డైనట్టి
మాననీయున కిదె మంగళమ్ము.
మిత్రులందరికీ శుభోదయం
కం:హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా! 
భావము:ఓ కృష్ణా! నీ శరీరము మంచిగంధముతో, అందమైన చేతులు కంకణములు, ఆభరణములతో, వక్షస్థలమున కౌస్తుభమణితో, ప్రకాశించుచున్న శరీరముతో ముద్దులొలుకుచూ బాల్యమును గడిపితివి. ఆనాటి నీ రూపము ఎంత మనోహరము!

తెలుగుకవిత్వము సమస్యా పూరణము వారి సమస్య:
*అంచ రవుతు జల్లె నమర బీజము లెన్నొ*
ఆ.వె:అంచ రవుతు జల్లె నమర బీజము లెన్నొ
అమరు రెల్ల బుట్టి రవని యందు
రామకార్య మందు రహిని బొందిరివారు.
వానరాలు రామ బంటు లైరి
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య
* వాాన కురియ మురిసె పడకటింట.*
.ఆ.వె:కొత్తదంపతులట కోటియాశలతోడ
నూళ్ళు తిరుగ నెంచి యుత్సుకతన
బస్తి యందు వారు బసచేయ వలపుల
వాన కురియ మురిసె పడకటింట.
శంకరాభరణం గ్రూప్ వారచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:ఆకు వక్క లొసగి యాదరించుట వల్ల
సంప్రదాయము లును సంస్కృతియును
వ్యక్త మగును గాదె! భక్తితో తాంబూల 
ఫలము లొసగ పుణ్య ఫలము లబ్బు.
శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన సమస్య:
*వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను.*
ఆ.వె:తనదు తప్పు లేక తార్పుడు కొంపలో
చేర వలసి వచ్చె చిన్నపాప
బ్రతుకు బుగ్గి యైన పరుల బ్రతుకు నిల్పు
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను.

1 ఆ.వె:సంధి మాట లెల్ల సమిసి పోవుట చేత
సాయమడుగగ కురు సార్వ భౌమ
పార్థు లేగి నారు బావ కృష్ణుకడకు
సాయమంద జేసె శౌరి యపుడె.
2.
తే.గీ:సంధి మాటలెల్లయు నట సమిసి పోగ
సమర మికతప్ప దనుచును శౌరి కడకు
ముందుగా వచ్చె కురుపతి ముందు జూచె
పార్థు;నందించె సాయము పద్మపాణీ.

శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన సమస్య:
*రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము *
తే.గీ: రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము 
కాదు,పరుల ప్రాణము నిల్చు ఖచ్చితముగ
మానవుల సేవ యే ,యిల మాధవార్చ
నంబనుచు దాన మొసగ పుణ్యంబు నబ్బు.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు వ్రాసిన పద్యము:
ఆ.వె:ధర్మ నిష్ఠ తోడ దైవ సన్నిధి చేర
సాగు చుందు రిలను జనులు చేరి
బీటు వార బాట భీతి వలదటంచు
శకటమును నడిపెను చాలకుండు.
తెలుగుకవిత్వము సమస్యా పూరణము వారి సమస్య:
ఆ.వె:గోప బాలు డపుడు గోపికలను వీడి
రాస లీల లాడ రాత్రి వేళ
రమణి చెంత చేర రాధ కినుక పూని
పూల తోడ బడిత పూజ చేసె
శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన సమస్య:
*సాధువులు గోరుచుంద్రు;సంసార సుఖము*
తే.గీ:సకల బంధములను వీడి జనుల సేమ
మరసి హితబోధ చేయుచు మంచి నెపుడు
సాధువులు గోరుచుంద్రు;సంసార సుఖము
వీడి దేశాలు తిరుగుట వెఱ్ఱి గాదె
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు వ్రాసిన పద్యము:
ఆ.వె:పసి వయసున పట్టు బట్టి నేర్చెడి తీరు
గన్న యచ్చెరువును గల్గు గాదె
అనతి కాలమందె అన్ని విద్యలరసి
ఖ్యాతి నొందు బాల ఖచిత మిదియు.
"గోదావరి" ( కవిత)
గంగా గంగా గోదారిగంగా
శివుని శిరసుపై కొలువున్న గంగా
గౌతముని పాపంబు పరిహరించిన గంగ
గౌతముని గోవుకు సద్గతి యొసగంగ
దివి నుండి భువికి దిగిన పావన గంగ
శిరము వంచి నీకు మ్రొక్కెదను గౌతమీగంగా
ముక్కంటి క్షేత్రాన యుద్భవించితివట
మక్కోటి దేవతలు నినుకోరి కొల్తురట
పశ్చిమమున నీవు ప్రభవించినావు
ఉరుకులతో పరుగులతొప్రవహించినావు 
పతిని చేరంగరాష్ట్రాలు దాటి వచ్చావు
పంట చేలను సస్యశ్యామలం చేశావు
రైతన్నలకు నీవు కల్పవృక్షమైనావు.
ఉపనదులతో కూడిసాగరుని చేరేవు
వరదలతో వంకలతో భయ పెట్టమాకమ్మ
దరహాసచంద్రికల నలరించవమ్మా
పుష్కరానికొకసారి పండగే జరిగేను
పుష్కర స్నానాల పుణ్యఫలమొసగు
అఘరాశి తొలగించి అనుగ్రహించుము తల్లి
నిన్ను దర్శించి పునీతులౌదుము మళ్ళీ మళ్ళీ
 శంకరాభరణం గ్రూప్ వారచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:కలహమె యశనంబుగ దిరుగు చుండెడి
దేవ మౌని యితడు దివిజ బంధు
తంపు బెట్టి సాగు తగవుల మునియని
ఖ్యాతినందినట్టి కలహప్రియుడు.
శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన సమస్య:
తే.గీ:సాయమడగంగ కురుపతి సవ్యసాచి
శౌరి కడకేగ నరునకు సంతసాన
మాధవుడు సారథియయె;సుయోధనునకు
యోధులను పది వేవుర యొసగె నపుడె.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య.
* ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని*
తే.గీ: గంగలో సుతుఁ విడిచిన కాంత యెవరు? 
కౌరవులు నూరుమందిని కన్నదెవరు?
తప్పు జూదమాడించిన తాత యెవరు?
ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని !
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు వ్రాసిన పద్యము
ఆ.వె:పొట్టలోని నూలు పొరలుగా దీయుచు
నేత నేయ సాగె లూత యొకటి
విసుగుచెంద కుండ విడువక పని చేయ
సాధ్యమవని దేది జగతి యందు.?
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య.
*సారాగొనె శివుడు లోక సంరక్షణకై*
కం:కూర్మంబయ్యెను శ్రీహరి
పారావారము జిలుకగ పడతియు గరళం
బేరాగా విషమును మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై.
శంకరాభరణం గ్రూప్ వారి్చిన చిత్రమునకు వ్రాసిన పద్యము
:ఆ.వె: జంట కవులు యన్న జగతి యందెల్లడ
ఖ్యాతి నంది నట్టి ఘనులు వీరు
ఆంధ్ర దేశ మందు యవధాన విద్యకున్
ఆద్యులైరి గనుడు యార్యులార.
కం:సరసముగా పద్యములను 
విరచించినమేటియైన విద్వాంసురిలన్
అరయగ వీరలు గాదే
తిరుపతి వెంకట కవులన తెలియుము మనుజా!
కం:తిరుపతి వెంకట కవులిల
విరచించిరి పద్యములను విడిగా,జతగా
సరసముగాకూర్చిన కవి 
వరులకు మ్రొక్కుదము రండు వాసిగ మీరున్
తెలుగుకవిత్వము సమస్యా పూరణము వారి సమస్య:
* పాలవలన జబ్బులెన్నొ పట్టు విడువకన్ *
కం :మేలగు పిల్లల తల్లులు
పాలిచ్చిన రక్తపాశబంధము లమరున్
బాలారిష్టపు డబ్బా
పాల వలన జబ్బులెన్నొ పట్టు విడువకన్
తెలుగు కవిత్వము వారి సమస్య
*పుష్కరమ్ము జనుల పుణ్య మణచె.*
ఆ.వె:పుణ్య మంద దలచి పుష్కరముల కేగ
ప్రాణములఱచేత పట్ట వలసె
స్నానమాడ దలచిస్వర్గస్తులైరిగా
పుష్కరమ్ము జనుల పుణ్య మణచె.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు వ్రాసిన పద్యములు
183ఆ.వె: విప్రవరుల యీసు విపరీతమైదోప
గోవు ప్రాణ మొదలె గుట్ర వలన
ఆవు సుగతి కొరకు నాచరించతపము
యుద్భవించె గంగ యుర్వి యందు.
217 ఆ.వె:గలగలమని పారు గౌతమీ గంగమ్మ
ఆంధ్ర దేశ ప్రజల అన్నపూర్ణ
పసిడి పంట లిచ్చు బంగారు మాతల్లి
జాగు సేయకుండ జయము లొసగు
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య
*
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము*
తే.గీ: రమ్యమైన దిదియె మన రాజధాని
భూతలస్వర్గ మన్నయ భూత కల్ప
నమ్ము గాదు లేనిదొకటె నమ్ము లేదు
హైదరాబాదులోననౌకాశ్రయయ్ము.
3 కం :నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవవైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయఁగ కృష్ణా! 
భావము: ఓ శ్రీమన్నారాయణా! పరమేశ్వరా! ఓ నీలమేఘశ్యామా! రాక్షసులను తుదముట్టించే రాక్షసవైరీ! పాలసముద్రముపై శయనిించువాడా! యదువంశకులాగ్రణీ! నన్ను దయతో రక్షించుము.
సాధారణంగా ఫరమేశ్వర శబ్దంశివునకువాడుతారు.కానీ విష్ణువు పరమేశ్వరుడే.ఫోతనాదికవులు కూడా విష్ణువుకు "ఈ్వశ్వర"శబ్దం వాడారు."రావే ఈశ్వరా కావవే వరదా "(గజేంద్రమోక్షంలో)
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య:
*వాణి వీణ యెల్లెడ నపస్వరము లొలుకు*
తే.గీ:నలువ రాణి వాణి జనుల నాల్కపైన
వాస మెనరించి దీవించు వరమొ సంగి
ఙ్ఞాన శూన్యు డొకడిలన ఙ్ఙతన బలికె
వాణి వీణ యెల్లెడ నపస్వరము లొలుకు.
అందరికీ శుభోదయం.
2
కం:నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా! 
ఓ శ్రీకృష్ణా! నీవే నాకు తల్లివి, తండ్రివి మరియు సహాయకుడివి. నీవే నాకు మిత్రుడవు. నా గురువు కూడా నీవే. నా దైవము, ప్రభువు. నాకు జ్ఞానమును ఉపదేశించువాడవు. ఇలా సమస్తము నీవే అయివున్నావు.
శంకరాభరణం వారిచ్చిన సమస్య
*కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు*
తే.గీ: సతి పతులు సరసమాడు సమయ మందు
ప్రణయ కలహమ్ము లాడుచు వలపు చేత
పరవశమ్మున మైమరువ ముదమార
కలికి పదతాడనమ్ములే కడు ప్రియముల
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన :-
న్యస్తాక్షరి 
అంశం వృక్షసంరక్షణ
ప-చ్చ-ద -నం
ఈఅక్షరాలు మెదటి అక్షరాలుగా ఆటవెలదిలో పద్యం.
ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
చ్చదనము విరియగ వెసన్ ,మదికి ము
దమును గల్గు గాన తరువులు బెంచుచు 
నందమొంద రండు నవల లార.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు
వ్రాసిన పద్యము.
ఆ.వె:నడుము లోన హొయలు నగవుతో కెమ్మోవి
తలచినంత చాలు తరుణి రూపు
కంటి చూపు లోనె కైపును గలిగించు
నాతిఁబొగడ తరమె నలువ కైన
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య:-
"
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె"
తే.గీ: పసిడి జింకను గోరెనా పడతి సీత
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
ద ననుచు కదిలె,వలదని తమ్ము డన్నఁ
వినక దుష్టుని/మారీచు శిక్షింప వెడలె తాను
శంకరాభరణంగ్రూప్ వారిచ్చిన ఈక్రింది చిత్రానికి వ్రాసిన పద్యం.
.
కం :పిల్లులు గలిగిన యింటను
కొల్లలుగా పిల్లలున్న కూరిమి తోడన్
మెల్లగ పాలును పెరుగును 
చల్లయు పిల్లుల కొసగుచు సంబర పడరే.
తెలుగుసాహిత్యము సమస్యా పూరణము వారిచ్చిన సమస్య:
*
నిద్ర కన్న యోగ నిద్ర ఘనము.*
ఆ.వె: క్షుద్ర విద్య లెల్ల క్షుణ్ణముగా నేర్చి
మంత్ర తంత్రములతొ మాట మార్చి
మత్తులోన నింపి మాయలో ముంచెత్తు
నిద్ర కన్న యోగ నిద్ర ఘనము.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య:
*హరుని వక్షస్స్థ లమ్మున నమరె లక్ష్మి.*
తే.గీ:సగము మేనయ్యె పార్వతి శంకరునకు
వదనమందున తానిల్చె వాణి పతికి
జలనిధి సుత తా సతియై చక్కగ ముర
హరుని వక్షస్స్థ లమ్మున నమరె లక్ష్మి.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య:-
*
నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.*
(యశోదమ్మ కృష్ణుని స్నేహితులతో)
కం:వెన్నుని పైకొండెములా
అన్నన్నా యెంత వింత యాటకు రాలే
నన్నందులకా! గొట్టెద
నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
తెలుగుసాహిత్యము సమస్యా పూరణము వారిచ్చిన 
సమస్య:-*మహిళ తెలివి నణచె మాధ్యమములు*
ఆ.వె: రాజకీయమునను రణరంగ మందైన 
శ్రమకు నోర్చి ఘనవిజయము నందు
చెత్త కథల తోడ చిత్తముల చెఱచి
మహిళ తెలివి నణచె మాధ్యమములు
శంకరాభరణం గ్రూప్ వారచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
.ఆ.వె;పాండు సుతుని సుతుని బవరాన తాజంపె 
సైంధ వుండు; తలచె సవ్యసాచి
సంజ లోపు వాని పరిమార్చ సాధ్యమౌ
గాదె కవ్వడికట చక్రి వలన.
తెలుగుకవిత్వము సమస్యా పూరణము
* కవిగారికి కడుపు పండ కందమును గనెన్*
కం :కవిగా వలెనని దలచుచు
వివరముగా వ్యాకరణము వేడ్కజ దవగా
యవధానముతో ముదమున
కవిగారికి కడుపు పండ కందమును గనెన్
తెలుగు కవిత్వము సమస్యా పూరణము వారిచ్చిన సమస్య:
*పంచెకట్టు చీర పరమసుఖము.*
ఆ.వె: ఆంగ్లదేశమందు యతిశీతలమువల్ల
మనిషి కానరాడు మంచు కప్ప
వేడి కొరకు బిగుతు వేషము వేసినా
పంచెకట్టు చీర పరమసుఖము.
తెలుగు కవిత్వము సమస్యా పూరణము వారిచ్చిన సమస్య:
*పంచెకట్టు చీర పరమసుఖము.*
ఆ.వె: ఆంగ్లదేశమందు యతిశీతలమువల్ల
మనిషి కానరాడు మంచు కప్ప
వేడి కొరకు బిగుతు వేషము వేసినా
పంచెకట్టు చీర పరమసుఖము.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
.ఆ.వె:తల్లి నెత్తి మీద తనయునెత్తికొనుచు
యేరు దాట సాగె వెరపు లేక
కన్న బిడ్డ కొఱకు కష్టము భరియించు
ధరను తల్లి కన్న దైవ మేది/మెవరు
శంకరాభరణం గ్రూప్ వారచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:రంగు రంగు విరుల రమణీయముగ కూర్చి
పెళ్ళి కూతురికిడ పెళ్ళికొడుకు
మురిసి పోయి జూడ ముచ్చటదియెగాదె
కనగ రండు మీరు కాంతలార.
తెలుగు కవిత్వము సమస్యా పూరణము వారిచ్చిన సమస్య:
*
ఇసుక విలువ పెరిగె నెల్ల దెసల.*
.ఆ.వె: ఇల్లు కట్ట నెంచ నిబ్బందు లెదురయ్యె
సమయమునకు తగిన సరుకు లేక
ఏటివరద దెచ్చు యిసుకయు ప్రియమాయె
ఇసుక విలువ పెరిగె నెల్ల దెసల.
"తెలుగు కవిత్వము సమస్యాపూరణం వారిచ్చిన సమస్య
*
ఉపవాసము చేసినంత నోపిక పెరుగున్*
కం:ఉపవాసము సల్పుటచే
ఉపయో గములుండు పెక్కులుర్విన్ వినుమా
నెపమెంచి మెక్క రుజలగు
ఉపవాసము చేసినంత నోపిక పెరుగున్
సమస్య:
*
నాగశయనుండు విహరించె;నంది నెక్కి *
తే.గీ:వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
నాగశయనుండు విహరించె;నందినెక్కి
హైమవతి తోడచరియించె హరుడు తాను
హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె
సమస్య:
*
నాగశయనుండు విహరించె;నంది నెక్కి *
తే.గీ:వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
నాగశయనుండు విహరించె;నందినెక్కి
హైమవతి తోడచరియించె హరుడు తాను
హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య :
*కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగి
132 కం; విరహమున వేగు తరుణీ
పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
హరిసుతు మాయని వలపుల
కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ
శంకరాభరణం గ్రూప్ వారి సమస్య:
*గీత నిస్సార మనెగద" కృష్ణుడౌర *
తే.గీ : కృష్ణు డనుపేరు గలవాడు కృష్ణునివలె
వేషము ధరించి చేబూని వేణువు కర
మందు పలికె గ్రామమునందు మంద బుద్ధిఁ
"
గీత నిస్సార మనెగద" కృష్ణుడౌర
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్య.
*గరుడుని గని సంతసించు గద భుజగమ్ముల్.*
కం:సరసంబుగ కేరింతల 
నిరతము నాడుచు చరించి నెమ్మది తోడన్
దిరగుచు ఖగమున వచ్చెడి
గరుడుని గని సంతసించు గద భుజగమ్ముల్
*వాణికి హరి ప్రాణ వల్లభుండు*
ఆ.వె: పాల కడలి యందు ప్రభవించిన సిరికి
శుభము లొసగునట్టి సుగుణమణికి
వరము లొసగుకల్పవల్లియౌ కోకిల
వాణికి హరి ప్రాణ వల్లభుండు.
తెలుగు కవిత్వము సమస్యా పూరణము వారిచ్చిన సమస్య:* మామ ముందుపతిని భామ కూడె.*
ఆ.వె: అతివ యన్ని పనులు యలవోకగాజేసి
పండు వెన్నెలందు పాన్పు పరచి
కలువభామఁజూచు గగనమందలి చంద
మామ ముందుపతిని భామ కూడె.
శంకరాభరణం గ్రూప్ వారచ్చిన ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:సెనగపిండి తోడ చేసిన గవ్వలు
కరకరమనుచునతి కమ్మనుండు
తెలుగు వారి రుచుల తీరును గనగరం
డువిద లెల్ల వండి రుత్సుకతన.
తెలుగు కవిత్వము సమస్యాపూరణము వారి సమస్య:
1
వ పాదం కాని 3 వ పాదం కాని రావాలి
*
బ్రహ్మచారియతడు బ్రహ్మాండము గొలిచెన్ *
ఆ.వె :బలిని యణచవచ్చె బాలరూపముతోడ
పొట్టి రూపుతోడ పుడమి వేడె
బ్రహ్మచారియతడు బ్రహ్మాండము గొలిచెన్ 
దానమొసగి బలియు ధన్యు డయ్యె.
సమస్య:
*
వరమున నిక్క తనునీల్గు వరమే శరమై
కం.హరుచే బొందెను యసురుడు 
వరమును తాకగ శిరమును భస్మమవంగన్/భస్మంబౌగన్
హరియాగమనంబున యా
వరమున నిక్క తనునీల్గు వరమే శరమై
తెలుగు కవిత్వము సమస్యా పూరణము వారిచ్చిన సమస్య:
*.తల్లిని తెగనరకి తిరిగి తల్లిని పొందెన్ *
కం : గొల్లుమనగ నితరసుతులు
తల్లిని వధియించి నట్టి తనయుండితడే ౹
విల్లమ్ముల దాల్చుహరిగ
తల్లిని తెగ నరకి తిరిగి తల్లిని పొందెన్
మిత్రులందరికీ శుభోదయవందనాలు.
ఈ పొడుపుకథను విప్పరూ
వృక్షాగ్రవాసీ న పక్షిరాజః
చర్మాంబరధారీ నచ సోమయాజిః
త్రినేత్రధారీ నచ శూలపాణిః
జలం ధరిత్రి ర్నఘటోన మేఘః.
మిత్రులందరికీ మస్కారములు.మా యాత్ర దాదాపుగా ముగింపు దశ కొచ్చింది.హరిద్వార్ కాశీ చూశాం.కాశీ లో అన్నపూర్ణను విశాలాక్షిని బిందుమాధవుని చూశాం.ఈ కాశీ నగరాన్ని చూస్తుంటే శ్రీనాథుఉని కాశీఖండం గుర్తొచ్చింది.వ్యాసుడు కాశినిశపింప బూనటం అన్నపూర్ణ ఆదరించడం ఆ ఘట్టాలన్నీ గుర్తొచ్చాయి.బదరీనాథుని కేదారేశుని చూస్తున్నపుడు పెద్దనగారి మనుచరిత్రలోని పద్యాలు గుర్తొచ్చాయి.కేదార్ లో అనుభవం వర్ణనాతీతం.మంచువర్షం.హెలీకాప్టర్ పోకపోవడం ఎప్పుడు తెల్లవారుతుందా అని చలిలో ఎదురు చూడటం ఓహ్!మధుర ద్వారక చూస్తున్నప్పుడు పోతనగారి పద్యాలు తిరుపతి వెంకట కవుల పద్యాలు గుర్తొచ్చాయి.ముఖ్యంగా"అదిగో ద్వారక ఆలమందలవిగో".సౌరాష్ట్ర సోమనాథుని మాతృగయను దర్శించుకొిని అహమ్మదాబాద్ చేరబోతున్నాం.అదేఈ యాత్రకు ఆఖరి మజిలి.అక్కడట్రైన్ ఎక్కితే 29-5-15స్వగ్రామం చేరుకొంటాం.అప్పటి వరకూ అందరికీ వందనాలు
మిత్రులకు శుభోదయం.
యాత్రలో రెండోమజిలి గయా క్షేత్రము.గదాధరుడైన
మహావిష్ణువు దర్శనం పితృకార్యాలు నిర్వర్తించడం.
గయాసురుని చంపడం కోసం అతని శరీరాన్ని యాచించగా ఆయన.అంగీకరిస్తాడు.శరీరంపై యఙ్ఞం చేయగా అదిసహకరించదు.దేవతలు విష్ణువును ప్రార్థించగా గదాధరుడై వచ్చి ధర్మశిలను వేసి దానిపై గదను వుంచడం వల్ల ఆతని శరీరం దగ్ధమౌతుంది.వరం కోరమంటే తనపేరున్న ఈక్షేత్రంలో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు ముక్తి కలిగేలా వరం కోరాడట.ఆ ధర్మశిల విష్ణుపాదం అలాగే వుంది.దానికి ప్రతిరోజు గంధంపూసి కుంకుమతో శంఖచక్ర గదా పద్మాలు దిద్ది అలంకరిస్తారు.
ఇక ధర్మశిల విషయానికొస్తే :బ్రహ్మ పు్త్రుని భార్య ధర్మశీల.ఈమె మరీచమహర్షి భార్య.ఓసారి మరీచుడు భార్య ఒళ్ళో పడుకున్నప్పుడు బ్రహ్మ వస్తాడట.మామగారు వచ్చారని లేస్తుంది.ఋషి కోపంతో శిలకమ్మని శపిస్తాడట.ఆమె విష్ణువును గూర్చి తపమెనర్చగా ఋషుల శాపాలకు విరుగుడు లేదనగా తనదర్శనంవల్ల భక్తులకు మంచి జరిగేలా చూడమంటుందట.విష్ణువు సూచనపై దేవతలు ఆశిలను గయుడిపై వేయగా దానిపై విష్ణువు పాదముంచి ఇద్దరిని అనుగ్రహిస్తాడట. 
బుద్దపౌర్ణమికూడా కావడంవల్ల బుద్దగయను కూడ చూశాము.తరువాతి మజిలి వారణాసి.ఆ వివరాలతో మళ్ళీ కలుస్తా.
చిత్రకవిత : ఉపశమన తరంగాలు గ్రూప్ లో ద్వితీయబహుమతి నందిన కవిత.
బల్లూరి ఉమాదేవి
29/4/15
వేసవిలొ భువిలోన మండేను ఎండలు
రోహిణీ కార్తెలో రాళ్ళు/రోళ్ళు పగిలేను
గ్రీష్మ మొచ్చిందంటె హెచ్చేను తాపము
ఆకు లల్లాడవు తరువులెన్నున్నా
కావాలి నీరిపుడు ఎండిన గొంతుకు
ఎంత తాగిన గాని తీరదీ దాహము
తాటిముంజలొసగేను మదికెంతొ హాయి
నిమ్మరసము త్రాగ నిమ్మళమ్ము కలుగు
తాళవృంతము వీవ తాకేను చిరుగాలి
వట్టివేళ్ళతోడ కలుగు నుపశమనము
కుండలోని నీళ్ళు చల్లంగనుండు
తనువు వేడెక్క నీకుండ కాపాడు
చల్లని మజ్జిగ దాహార్తి బాపు
కొ్బ్బరిబోండాలొసగేను సత్తువ
ముందు జాగ్రత్తతో వేసవి నెదుర్కొందామా!
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన
న్యస్తాక్షరి:-భూ కం ప ము అనే అక్షరాలు మొదటి అక్షరాలుగ ఊర్చిన తేటగీతి పద్యము.శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన
తే.గీ :భూమి భారము మోసెడి భూమితల్లి
కంపనమొనరింప గతియు గానమిలను
పచ్చ పచ్చని తరువులు వడలి పోవు
ముప్పు దప్పదు ప్రజలకు పుడమి యలుగ/కినియ




1 comment: