21/9/17
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:,2835నుండి2849 వరకు 15 పద్యములుి
గురజాడవారి జయంతి సందర్భంగా రచించిన పద్యములు.
అడుగుజాడ గురజాడ
1..ఆ.వె:రాయవరము నందు రామదాస సుతుడై
జనన మొందె ను గురజాడ నాడు
బాల్యమందె తండ్రి పరమపదించగా
తల్లి నీడ లోనె తాను/ధరను పెరిగె.
2.సీ:మేలిమి రత్నమై మేనమామల యింట
జనియించె గురజాడ జగతి యందు
విద్యలెల్లయు నేర్చి పేదరికము లోనె
బడిపంతులుగ తాను వాసికెక్కె
వ్యావహారికమైన భాషకు పట్టము
కట్టదలచి నట్టి కవి యితండు
గిడుగు పంతులతోడ కేలును గలుపుచు
, గ్రాంథిక వాదుల కచట కమ్మ
ఆ.వె: నైన బదులు నొసగి యవనియందీతండు
ఖిలము కాని యట్టి కీర్తి నంది
తెలుగు భాషలోన దీటుగా కావ్యముల్
వ్రాసిఘనత నందె వాసి గాను.
3ఆ.వె:ఆంధ్ర దేశమందు నవతరించి యతడు
వేగు చుక్క వోలె వెలిగి పోయె
అంటరాని తనము నంతరింపగచేయ
కవిత లల్లి గొప్ప కవియునయ్యె.
4.ఆ.వె:ఆంగ్లభాషయందు నల్లె కావ్య మొకటి
పాతికేళ్ళ పడుచు వయసు నందె
సంఘ సంస్కరణము సాధించ మొదలిడి
కలము తోడ తనదు బలము చూపె.
5.ఆ.వె:అడుగు జాడ యయ్యె పుడమిలో జనులకు
కమ్మనైన కావ్య ఖండికలను
వ్రాసి దారి చూపి వాసికెక్కిన కవి
వరున కిడుదు కోటి వందనాలు.
6.ఆ.వె:మంచి నెపుడు యిలను పెంచు మని పలికి
వట్టి మాట వల్ల బాధ మిగులు
నంచు గట్టి మేలు నయమున చేయంగ
ఖ్యాతి నందు జాతి ఘనతతోడ
7.ఆ.వె:పిరికి వాడివైన వెనుక బడెద వీవు
మందగించ కుండ ముందు కేగు
మనెడి మంచి మాట మరువబోకనుచును
నలుపు లేక చాటె నవని యందు
8.ఆ.వె:జనుల కుపకరించు చక్కని పనులను
చేయు మనుచు తాను చేసి చూపె
పరుల కలిమి గాంచి బాధతో యేడ్చిన
ఫలిత మేమి టనుచు ప్రశ్న చేసె.
9.ఆ.వె:వర్ణ భేదములను పాటించవలదని
జాతికి దెలిపె గురజాడ నాడు
ప్రేమ బంధము నిల ప్రియమార దెల్పుచు
స్ఫూర్తి దాత యగుచు కీర్తి నందె.
10.ఆ.వె:మూఢ నమ్మకములఁముందుగా ఖండించి
ప్రజల కెరుక చేయు వాంఛ తోడ
మేలుకొలుప ప్రజ నలుపులేక
సాగె నిలను తాను సంఘసంస్కర్తయై
అడుగు ముందు కేసె జడుపు లేక.
11.ఆ.వె:మంచి తనము నెపుడు పెంచవలెననుచు
ఆచరించి చూపె నవని యందు
సంఘ సంస్కరణకు సర్వశక్తులనొడ్డి
కూర్మితోడ దెచ్చె గొప్ప మార్పు.
12.ఆ.వె:దిద్దుబాటు వ్రాసి తెలుగు కథకు నయ్యె
నాద్యుడీ కవివరుడవని యందు
మాటలాడు భాషె మంచిభాషయటంచు
వ్రాసి చూపి తాను వాసికెక్కె.
13.ఆ.వె:దేశభక్తి తేట తెల్లము చేయుచు
అడుగు జాడ యయ్యె నాంధ్ర దేశ
మందు ,కన్యశుల్క మాది నాటకములు
వ్రాసి చూపి నాడు ప్రజలకెల్ల.
14.ఆ.వె:మట్టి గాదు గనుము మనుజులే దేశమౌ
ననుచు చాటి చెప్పె నవని యందు
పాత కొత్తలకును వారిధి తానయ్యె
యుగపురుషుడటంచు జగతి మెచ్చె.
15.ఆ.వె:వాడుచున్న భాషె వాసియైనదనెడి
రామమూర్తిఁగలిసి రక్తి తోడ
పామరజనులకును పరిచితమైనట్టి
వ్యావహారికంబు వ్యాప్తి చేసె.
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:,2835నుండి2849 వరకు 15 పద్యములుి
గురజాడవారి జయంతి సందర్భంగా రచించిన పద్యములు.
అడుగుజాడ గురజాడ
1..ఆ.వె:రాయవరము నందు రామదాస సుతుడై
జనన మొందె ను గురజాడ నాడు
బాల్యమందె తండ్రి పరమపదించగా
తల్లి నీడ లోనె తాను/ధరను పెరిగె.
2.సీ:మేలిమి రత్నమై మేనమామల యింట
జనియించె గురజాడ జగతి యందు
విద్యలెల్లయు నేర్చి పేదరికము లోనె
బడిపంతులుగ తాను వాసికెక్కె
వ్యావహారికమైన భాషకు పట్టము
కట్టదలచి నట్టి కవి యితండు
గిడుగు పంతులతోడ కేలును గలుపుచు
, గ్రాంథిక వాదుల కచట కమ్మ
ఆ.వె: నైన బదులు నొసగి యవనియందీతండు
ఖిలము కాని యట్టి కీర్తి నంది
తెలుగు భాషలోన దీటుగా కావ్యముల్
వ్రాసిఘనత నందె వాసి గాను.
3ఆ.వె:ఆంధ్ర దేశమందు నవతరించి యతడు
వేగు చుక్క వోలె వెలిగి పోయె
అంటరాని తనము నంతరింపగచేయ
కవిత లల్లి గొప్ప కవియునయ్యె.
4.ఆ.వె:ఆంగ్లభాషయందు నల్లె కావ్య మొకటి
పాతికేళ్ళ పడుచు వయసు నందె
సంఘ సంస్కరణము సాధించ మొదలిడి
కలము తోడ తనదు బలము చూపె.
5.ఆ.వె:అడుగు జాడ యయ్యె పుడమిలో జనులకు
కమ్మనైన కావ్య ఖండికలను
వ్రాసి దారి చూపి వాసికెక్కిన కవి
వరున కిడుదు కోటి వందనాలు.
6.ఆ.వె:మంచి నెపుడు యిలను పెంచు మని పలికి
వట్టి మాట వల్ల బాధ మిగులు
నంచు గట్టి మేలు నయమున చేయంగ
ఖ్యాతి నందు జాతి ఘనతతోడ
7.ఆ.వె:పిరికి వాడివైన వెనుక బడెద వీవు
మందగించ కుండ ముందు కేగు
మనెడి మంచి మాట మరువబోకనుచును
నలుపు లేక చాటె నవని యందు
8.ఆ.వె:జనుల కుపకరించు చక్కని పనులను
చేయు మనుచు తాను చేసి చూపె
పరుల కలిమి గాంచి బాధతో యేడ్చిన
ఫలిత మేమి టనుచు ప్రశ్న చేసె.
9.ఆ.వె:వర్ణ భేదములను పాటించవలదని
జాతికి దెలిపె గురజాడ నాడు
ప్రేమ బంధము నిల ప్రియమార దెల్పుచు
స్ఫూర్తి దాత యగుచు కీర్తి నందె.
10.ఆ.వె:మూఢ నమ్మకములఁముందుగా ఖండించి
ప్రజల కెరుక చేయు వాంఛ తోడ
మేలుకొలుప ప్రజ నలుపులేక
సాగె నిలను తాను సంఘసంస్కర్తయై
అడుగు ముందు కేసె జడుపు లేక.
11.ఆ.వె:మంచి తనము నెపుడు పెంచవలెననుచు
ఆచరించి చూపె నవని యందు
సంఘ సంస్కరణకు సర్వశక్తులనొడ్డి
కూర్మితోడ దెచ్చె గొప్ప మార్పు.
12.ఆ.వె:దిద్దుబాటు వ్రాసి తెలుగు కథకు నయ్యె
నాద్యుడీ కవివరుడవని యందు
మాటలాడు భాషె మంచిభాషయటంచు
వ్రాసి చూపి తాను వాసికెక్కె.
13.ఆ.వె:దేశభక్తి తేట తెల్లము చేయుచు
అడుగు జాడ యయ్యె నాంధ్ర దేశ
మందు ,కన్యశుల్క మాది నాటకములు
వ్రాసి చూపి నాడు ప్రజలకెల్ల.
14.ఆ.వె:మట్టి గాదు గనుము మనుజులే దేశమౌ
ననుచు చాటి చెప్పె నవని యందు
పాత కొత్తలకును వారిధి తానయ్యె
యుగపురుషుడటంచు జగతి మెచ్చె.
15.ఆ.వె:వాడుచున్న భాషె వాసియైనదనెడి
రామమూర్తిఁగలిసి రక్తి తోడ
పామరజనులకును పరిచితమైనట్టి
వ్యావహారికంబు వ్యాప్తి చేసె.
No comments:
Post a Comment