28/8/17
పద్యాలసవ్వడి
svdno:05
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:2772 నుండి 2789వరకు 18 పద్యములు
అంశం: శివస్తుతి.
ఛందస్సు:ఆ.వె:
1ఆ.వె:నాగభూషణుడవు నగజాత పతివీవు
భక్త వత్సలుడవు ఫాలనేత్ర
మాదు మొరలు వినుచు మమ్మాదరింపుమా
హరహర మహదేవ హర్ష మొసగు.
2ఆ.వె:కోరి త్రాగినావు గొడగూచి యొసగిన
కమ్మ నైన పాలు గరళకంఠ
భక్తసులభుడవట పాపాలు హరియించి
మమ్ము బ్రోవుమయ్య మారవైరి.
3ఆ.వె:పాశుపతము కోరె పాండుసుతుడు నాడు
తపము చేయుచుండ ధరణి యందు
వేటగాని వలెను వెలది గిరిజ తోడ
వచ్చి చేసితీవు బవరమచట.
4ఆ.వె:నీకు మనువు గూర్చ నెమ్మితోనేతెంచె
మన్మథుండుతాను మహిని నాడు
నాగ్రహమ్ము తోడ నగ్ని నేత్రము దీయ
కాలి బూడిదయ్యె కంతు డపుడె.
5ఆ.వె:పాలసాగరమున ప్రభవించిన యట్టి
విషము మ్రింగితీవు వెరపులేక
నీదు శక్తి నెరిగి నెమ్మితో డను మ్రింగు
మనియె శైలపుత్రి యవని యందు.
6ఆ.వె:తిన్నడనెడివాడు తిరుగు నొంటిగ
గాంచె లింగ మచట కానలోన
నీలకంఠు కంట నెత్తురు గారంగ
కన్నులొసగ నెంచ కాచితీవు.
7ఆ.వె:నంది వాహనుడవు నటరాజ మూర్తివి
చంద్రమౌళివీవు జయము నొసగు
నగజకు పతివీవు నామొరలాలించి
యాదరించవయ్య యసమనేత్ర.
8ఆ.వె:సగము మేనొసంగె నగజాతకీతడు
భోళ శంకరుండు భువిని నిజము
వేడుకొనెడి జనుల విడువడేక్షణము,కు
మార జనకు డితడె మార వైరి
9ఆ.వె:కోరికొలుచు వారి కొంగు బంగారమై
కూర్మి తోడ దీర్చు కోర్కొలెల్ల
సురనదిపతియితడె శూలపాణియితండె
భస్మధారి యితడె పరమ శివుడు.
10ఆ.వె:హరహరమహదేవ యనుచు ననవరతము
నిన్ను చేరి కొలుతు నీలకంఠ
మామొరాలకించి మమ్మేలు మనిశము
వేడు కొందుమయ్య విశ్వనాథ.
11ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా
గరళముంచె తాను కంఠమందు
జనుల భయము నుడిపి జయములొసగు చుండు
కొలువ రండు వేగ కూర్మి తోడ.
12.ఆ.వె:తపము చేయ గిరిజ తాపహరుని గూర్చి
కపటవటుని గానె కానుపించె
పరమశివుడతండు పదుగురి వాడుగా
పరిణయంబు నాడెభామ నపుడు.
13.ఆ.వె:పరమశివుడతండు పదుగురివాడుగా
పార్థు కొసగె తాను పాశుపతము
భక్తితోడ గొలున బలము హెచ్చుచు నుండు
భయము నుడుపు నతడు భద్రమూర్తి.
14ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా
వరములొసగుచుండు వాసిగాను
భోళశంకరుడని భూరిగా నుతియింప
సర్వమొసగునట్టి సాత్త్వికుండు.
15.ఆ.వె:కరము నుంచ చావు కలుగవలెననుచు
వరము కోరె నసుర వరుడు నాడు
పరమశివుడతండు పదుగురి వాడుగా
వరము నిచ్చి తాను బాధపడియె.
16.ఆ.వె:కోరికొల్చువారి కొంగుబంగారము
కామితమ్ము లొసగి కరుణచూపు
పరమశివుడతండు పదుగురి వాడుగా
సురనది పతి యితడె శూలధారి.
17.ఆ.వె:నంది నెక్కి తిరుగు నగరాజ సుతతోడ
సుతులిరువురు కొలువ సురలు మెచ్చ
పరమశివుడతండు పదుగురి వాడుగా
భస్మధారి యితడె భాగ్యమొసగు.
18.ఆ.వె:పాలకడలి యందు ప్రభవించి నట్టి యా
విషము గళము నందు వేగ దాల్చె
పరమశివుడతండు పదుగురివాడుగా
వలచి పెండ్లియాడె పార్వతమ్మ.
మంథా భానుమతి గారిచ్చిన సమస్యలు
సమస్య:*పరమశివుండతడు పదుగురివాడుగా*
ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా
గరళముంచె తాను కంఠమందు
భయము నుడిపి తాను జయములొసగు చుండు
కొలువ రండు వేగ కూర్మి తోడ.
2.ఆ.వె:తపము చేయ గిరిజ తాపహరుని గూర్చి
కపటవటుని గానె కానుపించె
పరమశివుడతండు పదుగురి వాడుగా
పరిణయంబు నాడెభామ నపుడు.
3.ఆ.వె:పరమశివుడతండు పదుగురివాడుగా
పార్థు కొసగె తాను పాశుపతము
భక్తితోడ గొలున బలము హెచ్చుచు నుండు
భయము నుడుపు నతడు భద్రమూర్తి.
4ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా
వరములొసగుచుండు వాసిగాను
భోళశంకరుడని భూరిగా నుతియింప
సర్వమొసగునట్టి సాత్త్వికుండు.
5.ఆ.వె:కరము నుంచ చావు కలుగవలెననుచు
వరము కోరె నసుర వరుడు నాడు
పరమశివుడతండు పదుగురి వాడుగా
వరము నిచ్చి తాను బాధపడియె.
6.ఆ.వె:కోరికొల్చువారి కొంగుబంగారము
కామితమ్ము లొసగి కరుణచూపు
పరమశివుడతండు పదుగురి వాడుగా
సురనది పతి యితడె శూలధారి.
7.ఆ.వె:నంది నెక్కి తిరుగు నగరాజ సుతతోడ
సుతులిరువురు కొలువ సురలు మెచ్చ
పరమశివుడతండు పదుగురి వాడుగా
భస్మధారి యితడె భాగ్యమొసగు.
8.ఆ.వె:పాలకడలి యందు ప్రభవించి నట్టి యా
విషము గళము నందు వేగ దాల్చె
పరమశివుడతండు పదుగురివాడుగా
వలచి పెండ్లియాడె పార్వతమ్మ.
No comments:
Post a Comment